అమ్మాయిలకు అలంకరణపై మక్కువ ఎక్కువ. మరి తామెంతో ఇష్టంగా చేసుకునే వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని కూడా అంతే అందంగా తీర్చిదిద్దుతారు. అదెలాగో చెబుతున్నారు డెకార్బై కృష్ణ నిర్వాహకురాలు కల్పన. లక్షీ దేవి విగ్రహం ఉంటే సరే సరి. లేదంటే కలాశాన్నే ఆమె ప్రతిరూపంగా భావించొచ్చు. కళ్లను ఆకర్షించే పసుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో జరీ అంచున్న దుపట్టా లేదా చీరను ఇందుకోసం ఎంచుకోవాలి.