సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్ యాత్ర అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. తెలంగాణలో టూరిజంకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. గిరిజన యూనివర్శిటీ కోసం ములుగులో స్థలం కేటాయించామని.. దానికి ఇప్పటివరకు