పంజాబ్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ బలహీనతను మరోమారు బట్టబయలు చేస్తున్నాయి. మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండగా నూతన ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్ని, పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధు పీకల్లోతు అంత:కలహాల్లో మునిగిపోయారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమైనారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్బై చెప్పనున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ల లోనూ ఇదే స్థితి.