ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల దర్యాప్తులో మితిమీరిన ఆలస్యం జరుగుతుండడంపై బుధవారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలు కేసులు నమోదు చేస్తున్నా, వాటికి ఎప్పటికీ ముగింపు ఉండడం లేదని ఆక్షేపించింది. ఛార్జిషీట్ దాఖలుకు 10-15 ఏళ్లా?