శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్కో చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలుపుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. నారాయణరెడ్డి గురువారం కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు.