ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటతో బతుకమ్మలకు సద్దులు కడదామనే నినాదంతో అక్టోబరు 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రజాగాయని విమలక్క బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి పంటతో బతుకమ్మలకు సద్దులు కడదాం
ప్రకృతి–పర్యావరణం–ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతి అనే అంశాలను కేంద్రంగా చేసుకుని బహుజన బతుకమ్మను ఉద్యమంగా కొనసాగిస్తూ 2021నాటికి పదవ ఏడులోనికి ప్రవేశిస్తున్నాం..