ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖ) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వైజాగ్ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించడం దారుణమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వైటి.దాస్ అన్నారు. కూర్మన్నపాలెంలోని స్టీల్ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే దీక్షలు మంగళవారానికి 82వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఎంఎంఎస్ఎం విభాగ ఉద్యోగులు కూర్చున్నారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ ఉక్కు ఉద్యోగుల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇదేనన్నారు.