comparemela.com


ప్రవీణ్‌కుమార్‌పై కేసు
నమోదు చేయాలని కరీంనగర్‌ పోలీసులకు కోర్టు ఆదేశం
హిందూదేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారని ఫిర్యాదు
 
కరీంనగర్‌ క్రైం, జూలై 21 : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని  కరీంనగర్‌ ప్రిన్సిపల్‌ జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ సాయిసుధ బుధవారం స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌(ధూళికట్ట) గ్రామంలో మార్చి 15à°¨ హిందూదేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన స్వేరోస్‌ భీమ్‌దీక్ష కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్‌బాబు ఆ ప్రతిజ్ఞ చేయించారు.
హిందూదేవతలను అవమానించే రీతిలో ప్రతిజ్ఞ చేశారని న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి కోర్టులో  ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన అనంతరం ప్రవీణ్‌కుమార్‌, న్యాతరి శంకర్‌బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా, తనకు చట్టం, మన రాజ్యాంగంపై విపరీతమైన విశ్వాసం ఉందని ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. తెలంగాణ పోలీసుల వృత్తిపరమైన నిబద్ధతపై తనకు నమ్మకం ఉందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిజ్ఞతో తనకు సంబంధంలేదని ఆ వీడియో వైరల్‌ అయినప్పుడు స్పష్టం చేసినట్లు తెలిపారు. దీని వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే అందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు నిర్వాహకులు వివరణ ఇచ్చినట్లు తెలిపారు.

Related Keywords

, Peddapalli District , Village March , Act Her , பெட்தாபபல்ளி மாவட்டம் , கிராமம் அணிவகுப்பு ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.