పుత్తూరు (చిత్తూరుజిల్లా) : కరోనా కష్టకాలంలో నిరుపేదలు, యాచకులను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తున్నాడు సాధారణ కూలీ కుటుంబానికి చెందిన ఓ వలంటీర్. తండ్రిని పోగొట్టుకుని పేదరికపు కష్టాలను స్వయంగా చవిచూసిన ఈ యువకుడు పదిమందికి ఉపయోగపడాలన్న తన లక్ష్యసాధనలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ యువకుడి సేవాగాథ వివరాలివీ.. పుత్తూరు మండలం తడు�
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ సువార్తికులు రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ (63) ఆదివారం కింగ్కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో కన్నుమూశారు. పదిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ప్రభుకిరణ్, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం పెంబర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుత జనగామ జిల్లా పెంబర్తికి చెందిన
లండన్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లన్నీ రెండు డోసులవి కాగా, జాన్సన్ అండ్ జాన్సన్కు చెందిన సింగిల్ డోస్ టీకాకు యూకే ఆమోదం తెలిపింది. యూకేలో ఆమోదం పొందిన నాలుగో వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. రెండు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను బ్రిటన్ ఆర్డర్ చేసింది. రాబోయే రోజుల్లో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ముఖ్యమైన పాత్ర పోషించబోతోందని యూకే హెల్త్ అండ్ �
భోపాల్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు, అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అధికారులు లాక్డౌన్ ఉల్లంఘించిన ప్రజలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఛత్తీస్గఢ్ సూరజ్పూర్లో లాక్డౌన్ ఉల్లంఘించిన ఓ వ్యక్తిపై కలెక్టర్ చేయి చేసుకున్న ఘటన మరవక ముందే అదే �