సైదాబాద్ : సైదాబాద్లో ఆరేళ్ల బాలికను పైశాచికంగా హత్యాచారం చేసి పారిపోయిన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం లభ్యమైంది. చేతిపై ఉన్న టాటుని చూసి అది రాజు మృతదేహంగా పోలీసులు గుర్తించారు. రాజుని పట్టుకునేందుకు గత ఏడు రోజులుగా ప్రత్యేక బృందాలు నగరాన్ని జల్లెడ పట్టారు. మరోవైపు వీరికి రాజధానిలోని వేలమంది సహకారం అందించారు. పోలీసులు ప్రకటించిన రెండు ఫోన్ నంబర్లకు వందలకొద్దీ కాల్స్ వచ్చాయని ఉత్తర మండలం సంయుక్త కమిషనర్ ఎం.రమేష్రెడ్డి తెలిపారు. రాజు వివరాలున్న ఫొటోలను ప్రదర్శిస్తూ హైదరాబాద్ పోలీసులు గణేశ్ మండపాల వద్ద మైకుల ద్వారా ప్రచారం చేశారు.