comparemela.com

పాకాల (చిత్తూరు) : 'మీ ఇళ్లపై బాంబులేస్తా' అంటూ.. మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన వైనం సోమవారం సాయంత్రం వల్లివేడు పంచాయతీ ఎస్‌టి కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు పంచాయతీ ఎస్‌టి కాలనీలో యానాది కృష్ణయ్య (47) నివాసముంటున్నాడు. సోమవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో మద్యం సేవించిన కృష్ణయ్య ఓ బ్యాగ్‌లో నాటుబాంబులను తీసుకొని హల్‌చల్‌ చేశాడు. పక్కవాళ్లను దూషించి, మీ ఇళ్లపై నాటుబాంబులేస్తానంటూ.. స్థానికులను బెదిరించాడు. ఓ నాటుబాంబును కిందపడేయడంతో వెంటనే పేలింది.

Related Keywords

Chittoor ,Andhra Pradesh ,India , ,Chittoor District Chandragiri ,சித்தூர் ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.